త్రివిక్రమ్ తో 25 వ మూవీ చేయనున్న సూపర్ స్టార్!

  • September 24, 2016 / 07:42 AM IST

ఊపిరితో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల చూపు తన వైపు తిప్పుకున్న డైరక్టర్ వంశీ పైడి పల్లికి అద్భుత అవకాశం  చేతి కందినట్టే అంది జారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ 25 వ సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ ని అతను కోల్పోయారు. ఇందుకు కారణం వంశీనే అని తాజా సమాచారం. గతనెల ప్రిన్స్ జన్మదినం సందర్భంగా పీవీపీ నిర్మాణంలో తాను మహేష్ 24 వ మూవీని దర్శకత్వం వహిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఈ విషయం పై మహేష్ హర్ట్ అయ్యారట.

ఆయనకు ఒక మాటకూడా చెప్పకుండా పోస్టర్ డిజైన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మహేష్ సన్నిహితులు చెప్పారు. దీంతో అతనితో సినిమాను హోల్డ్ లో పెట్టారు. ప్రస్తుతం మహేష్ 23 వ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుంది. ఆ వెంటనే కొరటాల శివతో 24 వ ఫిల్మ్ మొదలు కానుంది. జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ తో పాటు సమాంతరంగా మరో సినిమాలో నటించే ప్లాన్ లో ప్రిన్స్ ఉన్నారు. ఆ  సినిమా వంశీ తో ఉంటుందని నిన్నటి వరకు అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు కొత్త విషయం బయటికి వచ్చింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు తన 25 వ మూవీ చేసే ఛాన్స్ ని సూపర్ స్టార్ ఇచ్చినట్లు  తెలిసింది. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచే సినిమా కావడంతో త్రివిక్రమ్ అయితే బాగుంటుందని భావించి ప్రిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక వంశీ పైడి పల్లి 26 వ సినిమాను డైరక్ట్ చేస్తాడా? అప్పటి వరకు వేచి చూడలేక మరో హీరో తో సినిమా చేస్తాడా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus