సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన మహేష్, నమ్రత!

  • November 1, 2017 / 10:19 AM IST

డైరక్టర్స్ హీరో మహేష్ బాబు. స్టార్ హీరో అయినప్పటికీ సినిమా మేకింగ్ విషయంలో వేలు పెట్టరు. ప్రతి సినిమాని తొలి సినిమాల భావించి కష్టపడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వరుసగా రెండు అపజయాలను చవిచూశారు. బ్రహ్మోత్సవం, స్పైడర్.. రెండూ ఆశించినంతగా ఆడలేదు. దీనికి కారణం ఏమిటని మహేష్ అండ్ నమ్రత బృందానికి కొత్త కారణం తెలిసింది. అదే సోషల్ మీడియాలో మహేష్ చిత్రాలకు నెగిటివ్ ప్రచారం జరగడం. బ్రహ్మోత్సం సమయంలో డ్యాన్స్ వీడియోలు, స్పైడర్ సమయంలో జోరుగా బాగాలేదనే కామెంట్స్ విహరించాయి. ఆ నెగిటివిటీని తగ్గించడానికి నమ్రత కొత్త ప్లాన్ వేశారు.

సోషల్ మీడియాలో మహేష్ చిత్రాలకు పాజిటివ్ టాక్ క్రియేటయ్యేలా చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త సాంకేతిక బృందాన్ని నియమించుకున్నారు. ఆ టీమ్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో మహేష్ బాబు పేరుతో పేజీలను సృష్టించనుంది. అలాగే ఆటీన్ నెగిటివ్ కామెంట్ విస్తరించకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. దీనికోసం కొత్త సోషల్ మీడియా టీమ్ పని మొదలు పెట్టనుంది. ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus