650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ నమ్రత దంపతులు!

  • February 11, 2019 / 06:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత లు నేడు తమ 14 వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడు ముందుడే మహేష్ – నమ్రత దంపతులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. 650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు.

బేగంపేట లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాట్లు చేశారు. మంచి మనసున్న మహేష్ – నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని కోరుకుందాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus