రేపటితో చెన్నై షెడ్యూల్ కంప్లీట్

  • September 21, 2016 / 10:16 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం  చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. రేపటితో ఇక్కడి షెడ్యూల్ కి  పేకప్ చెప్పనున్నారు. దీంతో విశ్రాంతి లేకుండా గత రెండు వారాలుగా షూటింగ్ లో పాల్గొన్న చిత్ర బృందం రిలాక్స్ కానుంది. అయితే ఎక్కువ రోజులు విరామం తీసుకోకుండా మూడో షెడ్యూల్ మొదలు అవుతుందని తాజా సమాచారం.

ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో ఈ నెల చివర్లో ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్నారు. ఇందులో ప్రిన్స్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నఈ సినిమా  ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల కానుంది. జనవరి నాటికీ షూటింగ్ కంప్లీట్ చేసి, సంక్రాంతికి టీజర్ విడుదల చేయాలనీ మురుగ దాస్ భావిస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus