Mahesh Babu: ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ అభిప్రాయమిదే!

  • August 11, 2021 / 06:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా త్వరలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నా చిన్న సినిమాలే ఎక్కువగా రిలీజవుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా అంతోఇంతో కలెక్షన్లు సాధిస్తున్నా మిగతా సినిమాలకు ఎక్కువగా కలెక్షన్లు రావడం లేదు.

తాజాగా మహేష్ బాబు ఓటీటీల గురించి స్పందిస్తూ తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజయ్యే అవకాశమే లేదని చెప్పారు. థియేటర్లతో తన ఫ్యాన్స్ కు ఉన్న కనెక్షన్ ను తాను తెంచనని సూపర్ స్టార్ వెల్లడించారు. తన సినిమాలు మొదట థియేటర్లలోనే విడుదలతాయని థియేటర్లను లక్ష్యంగా చేసుకునే తాను నటిస్తున్న సినిమాలు తెరకెక్కుతున్నాయని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఓటీటీలను తాను గౌరవిస్తానని తాను ఓటీటీలను తక్కువ చేసి చూడటం లేదని మహేష్ పేర్కొన్నారు.

ఓటీటీ ప్రత్యేకమైన సంస్థ అని ఓటీటీల గురించి మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీలలో ఎక్కువగా రిలీజవుతున్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus