కీర్తి సినిమాల ఎఫెక్ట్.. హీరోయిన్ గా వద్దంటున్న ఫ్యాన్స్!

  • November 6, 2020 / 01:01 PM IST

‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు ఉత్తమనటిగా అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ కి తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలాంటి టాలెంటెడ్ హీరోయిన్ ని పెట్టుకుంటే సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించి స్టార్ హీరోలు తమ చిత్రాల్లో హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందంగా లేరు.

కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తప్పించి.. మరొకరిని తీసుకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దానికి కారణం.. కీర్తి సురేష్ ఫ్లాపులే. ఆమె నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజై బోల్తా కొట్టాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెంగ్విన్’ సినిమా మిస్ ఫైర్ అయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మిస్ ఇండియా’ సినిమాకి దారుణమైన రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా కాన్సెప్ట్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ లుక్స్, పెర్ఫార్మన్స్ కూడా చాలా మందికి నచ్చడం లేదు. గతంలో కాస్త బొద్దుగా ఉండే కీర్తి సడెన్ గా జీరో సైజ్ కి మారిపోయింది.

తన ముఖంలో కళ కూడా కోల్పోయింది. ‘మిస్ ఇండియా’ సినిమా కోసం సన్నబడ్డానని చెబుతున్నా.. అందులో స్లిమ్ లుక్ తో కనిపించాల్సిన అవసరమైతే లేదు. కనీసం మహేష్ సినిమా కోసమైనా.. మునుపటిలా కాస్త బరువు పెరిగి క్యూట్ లుక్స్ తో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ కీర్తి వరకు వెళ్లినా.. ఆమె బరువు తగ్గుతుందని చెప్పలేం. ఎందుకంటే ఈ స్లిమ్ లుక్ కోసం కీర్తి చాలా కష్టపడింది. మరి అభిమానుల కోరిక మేరకు ఈ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేస్తుందేమో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus