మహేష్ కు కూడా ఆ వ్యాధి ఉందట..!

  • September 13, 2019 / 04:39 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండేళ్ళుగా గత మూడేళ్ళుగా 1000 మంది పిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించి… వారికి ప్రాణం పోసాడు. అలా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు మహేష్ బాబు. అలాంటి ఈ స్టార్ హీరో కూడా అనారోగ్యం పాలైనట్టు చెప్పి అందరికీ షాకిచ్చాడు. అయితే అభిమానులు కంగారు పడకండి… అది ఇప్పుడు కాదు… గతంలో.. ! ఇటీవల మహేష్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ ద్వారా మహేష్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. విషయం ఏంటంటే.. ఒకప్పుడు విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధపడ్డాడట మహేష్. ఎంతో మంది వైద్యులను సంప్రదించినప్పటికీ ఉపయోగం లేకపోయిందట. కానీ సమస్య చక్రసిద్ధ నాడి వైద్యంతో మాత్రం నయమైందని చెప్పుకొచ్చాడు.

మహేష్ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు తన భార్య నమ్రత స్నేహితురాలి ద్వారా సత్య సింధూజ అనే డాక్టర్ ని సంప్రదించారట. ఆమెకి చక్రసిద్ద నాడీ వైద్యం గురించి బాగా తెలుసంట. నాలుగైదు సార్లు ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత మైగ్రేన్ సమస్య పూర్తిగా నయమైపోయిందట. ‘ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా నివారిస్తాయి.. అది సరైన పద్ధతి కాదు. నేను కూడా నొప్పిని తట్టుకోలేక విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకునేవాడిని. కానీ సత్య సింధూజ అందించిన వైద్యంతో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండానే.. ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది నేను నమ్మే సిద్ధాంతం. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే ఈ విషయాన్ని మీడియా ముందు చెప్తున్నాను. నా కుటుంబసభ్యులు, స్టాఫ్ కి మాత్రమే నాకు మైగ్రేన్ ఉందని తెలుసు..! నా వర్క్ ద్వారానే మెడిటేషన్ చేస్తుంటాను. నాడీ వైద్యం గురించి ప్రచారం కల్పిస్తున్నానని అనుకోకపోతే ఎన్ని చికిత్సలు తీసుకున్నా మైగ్రేన్‌ వల్ల చాలా కాలంగా బాధపడుతున్నవారు ఒకసారి చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి తెలుసుకోండి’ అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus