ఈ టైంలో మహేష్ రిస్క్ చేస్తాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక తన తరువాతి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ‘సర్కారు వారి పాట’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోందని కృష్ణ పుట్టినరోజు అయిన మే31న అధికారికంగా ప్రకటించారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా..

‘జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బ్యాకింగ్ కుంభకోణాల నేపధ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది అనే టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రం కథ ప్రకారం మొదటి షెడ్యూల్ ను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉందట. అందుకే నవంబర్ నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తుంది. అది కూడా అక్కడ కరోనా హడావిడి తగ్గితేనే..! లేదంటే వచ్చే ఏడాది వరకూ ‘సర్కారు వారి పాట’ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు.

Mahesh Babu fans feeling tensed about Parasuram1

అయితే ఈ లోపే మహేష్ అమెరికా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ‘స్పైడర్’ సినిమా టైములోనే మహేష్ కాలికి గాయం అయ్యింది. దానికి సర్జెరీ కూడా చేయించాల్సి ఉందట. అటు తరువాత ఒక 2,3 నెలల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాలని తెలుస్తుంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus