మ‌హేష్‌ తో త్రివిక్ర‌మ్ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే ?

  • April 24, 2018 / 12:43 PM IST

సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన అతడు మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఖలేజా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ వీరి కలయికలో సినిమా కోసం అభిమానులు ఎదురుచూసారు. కొన్ని రోజుల క్రితం వంశీ పైడిప‌ల్లి త‌ర్వాత మ‌హేష్ త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో నటిస్తారని వార్తలు రావడంతో ఫ్యాన్స్ సంతోషించారు. 25 వ చిత్రం కంటే 26 వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచుస్తున్నారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబో ఇప్పట్లో లేన‌ట్టేనని అర్ధమవుతోంది.

భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు మహేష్ స్పష్టం చేశారు. ఇంకా ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ కి అవకాశం ఇస్తారనుకుంటే అదీ లేదు. అర్జున్ రెడ్డితో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డితో మ‌హేష్ సినిమా చేయనున్నారు. ఇందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలయిపోయింది. ఈ లెక్కన చూస్తే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సినిమా ఇప్ప‌ట్లో లేనట్టేనని స్పష్టం అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus