నమ్రత కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పిన మహేష్

  • January 22, 2018 / 06:34 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ 1993లో మిస్ ఇండియా కిరీటం అందుకున్నారు. ఈమె 1998 లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు. వంశీ చిత్రం సమయంలో మహేష్ ని ప్రేమించి 2005 (ఫిబ్రవరి 10 ) లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. తన కోరికలు, కలలకు గుడ్ బై చెప్పారు. మహేష్ వ్యవహారాలు, పిల్లలు గౌతమ్, సితారలను పెంపకంలోనే సమయాన్ని గడిపేశారు. అలా నమ్రత చేయడంతో ఆమెపై మహేష్ కి ప్రేమ రెట్టింపు అయింది. అందుకే సమయం దొరికినప్పుడల్లా తన ప్రేమని వ్యక్తపరుస్తుంటారు.

ఈరోజు నమ్రత పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు. “నువ్వు నాకెంతో ప్ర‌త్యేక‌మో చెప్పేందుకు మ‌రో కార‌ణం.. హ్యాపీ బ‌ర్త్‌డే మై ల‌వ్, మై బెస్ట్ ఫ్రెండ్‌, మై వైఫ్‌” అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు. భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. అభిమానులు కూడా విషెష్ చెబుతున్నారు. నమ్రత తన సిగెరెట్ తాగే అలవాటుని మాన్పించిందని అనేక సార్లు మహేష్ వెల్లడించారు. అలాగే మహేష్ దత్తత తీసుకున్న గ్రామాలను నమ్రత దగ్గర ఉండి అభివృద్ధి కార్యక్రమాలను పర్వవేక్షిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus