భారీ ధరకు అమ్ముడుపోయిన మహేష్ మూవీ ఆడియో!

  • December 2, 2017 / 07:40 AM IST

శ్రీమంతుడు.. ఇండస్ట్రీ హిట్. ఆ కాంబినేషన్లో మూవీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమాపై క్రేజ్ నెలకొని ఉంది. ఇందులో తొలి సారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీమంతుడికి సంగీతమందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి స్వరాలూ సమకూర్చారు. ఆ పాటలకు సూపర్ డిమాండ్ ఉంది. అది కూడా భారీ ధరకు. భరత్ అనే నేను ఆడియో రరైట్స్ ను లహరి మ్యూజిక్ కంపెనీ  1.90కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది.  కేవలం ఆడియో ఇంత ధర పలికిందంటే ఇక సినిమా బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని ట్రేడ్ వర్గాల వారు ఆలోచిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తమిళనాడు లోని పొల్లాచి లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత తమిళనాడులో “హెరిటేజ్‌ టౌన్‌”గా పేరొందిన కారైకుడిలో జరుగుతుంది. డిసెంబర్‌ 10 నుంచి ఓ పదిహేను రోజుల పాటు అక్కడ  కొన్ని కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కారైకుడి షెడ్యూల్‌తో మూడు పాటలు, ఓ ఫైట్‌ మినహా సినిమా పూర్తవుతుంది. వీటిని వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరించడానికి కొరటాల ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా ఏప్రిల్ లో థియేటర్ లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus