మహేష్ మూవీ హైదరాబాద్ షెడ్యూల్ కి పేకప్ చెప్పిన మురుగదాస్

  • January 31, 2017 / 07:15 AM IST

గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో డిసెంబర్ 24 వరకు భారీ షెడ్యూల్ ని పూర్తి చేసిన డైరక్టర్ మురుగదాస్ నెక్స్ట్ షెడ్యూల్ ని  హైదరాబాద్ లో జనవరి మొదటివారంలో మొదలు పెట్టారు. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన హైదరాబాద్ రోడ్ సెట్  లో జరిగిన ఈ షెడ్యూల్ నిన్నటితో విజయవంతంగా పూర్తిచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్ జె సూర్యలపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు తమిళం భాషల్లో ఈ మూవీని ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. నగరంలో షెడ్యూల్ పూర్తికావడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు.

ఫిబ్రవరి 11 నుంచి ముంబయిలో ఓ షెడ్యూల్ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. ముంబయి తో పాటు పూణే, డయ్యూ ప్రాంతాల్లో చిత్రీకరణ సాగుతుందని వారు వెల్లడించారు. దీంతో ఫిబ్రవరి చివరికి టాకీ పార్టీ పూర్తి అవుతుందని, అనంతరం మిగిలిన రెండు పాటలకు కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు వివరించారు. మే నెలలో చెన్నై, హైదరాబాద్ లలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి “సంభవామి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇన్వెస్టుగేట్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus