జమ్మలమడుగు వెళ్లనున్న మహేష్, మురుగదాస్ బృందం

  • February 20, 2017 / 06:24 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రం నిన్నటి వరకు ముంబై లో చిత్రీకరణ జరుపుకుంది. తుపాకీ సినిమా లొకేషన్లో మహేష్ పై ఇంట్రడక్షన్ సీన్లు షూట్ చేశారు. నిన్నటితో సినిమా టాకీ పార్ట్ 90 శాతం కంప్లీట్ చేసుకున్నట్లు నిర్మాతలు ఠాగూర్ మధు, ప్రసాద్ లు వెల్లడించారు. ఫిట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఈ మూవీ రేపటి (21) నుంచి కడప జిల్లాలోని జమ్మలమడుగులో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇక్కడ ఎస్.జె. సూర్య, మహేష్ లపై కొన్ని సీన్లను తెరకెక్కించనున్నారు. పదిరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనుంది. సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో మహేష్ లుక్ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus