ఒకేసారి రిలీజ్ కానున్న ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ చిత్రాలు

  • February 9, 2018 / 07:16 AM IST

సినిమాలను చక్కగా తీయడమే కాదు.. సరైన సమయంలో రిలీజ్ చేస్తేనే మంచి కలక్షన్స్ సాధిస్తాయి. అందుకే స్టార్ హీరోలు మంచి సీజన్లో తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ఒక స్టార్ హీరో మూవీ వస్తుందనుకుంటే మరో స్టార్ మూవీని ఒక వారం అటు ఇటుగా రిలీజ్ చేయడం కామన్. కానీ వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇందులో ముందువరుసలో ఉంది సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ గత ఏడాదే మొదలయింది. సినిమాని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ విజువల్ ఎఫక్ట్స్ వర్క్ కారణంగా సంక్రాంతికి విడుదలచేయడానికి ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ కి పోటీ ఇవ్వడానికి మహేష్ సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఏప్రిల్ ల్లో మొదలుకానున్న ఆ సినిమాను డిసెంబర్ లోగాపూర్తి చేసి 2018 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కూడా సంక్రాంతిపైనే కన్నేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని వచ్చే నెలలో మొదలెట్టి డిసెంబర్ నాటికీ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి థియేటర్లోకి వస్తే సందడే సందడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus