మహేష్.. కసరత్తులు గట్టిగానే చేస్తున్నాడు

  • June 25, 2019 / 03:35 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వ‌రు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ర‌ష్మిక మంద‌న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ విజ‌య‌శాంతి ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. జూలై మొద‌టి వారం నుండీ ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలుకానుంది. మిలిటరీ నేపథ్యంలోను అలాగే రాయలసీమ నేపథ్యంలోను సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కాబట్టి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకి ప్రాధాన్యత ఎక్కువే. దీంతో ప్ర‌స్తుతం ఈ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం మహేష్ ప్ర‌త్యేక్ష శిక్ష‌ణ తీసుకుంటున్నాడట.

ఇందుకోసం ఇట‌లీ నుండి ఓ ప్ర‌త్యేక శిక్ష‌ణ బృందం వ‌చ్చి మహేష్ కు ట్రైనింగ్ ఇస్తుందని సమాచారం. మరో ప‌దిరోజుల పాటు మ‌హేష్ శిక్ష‌ణ తీసుకుంటాడట. అటు తరువాత మొదటి షెడ్యూల్ కోసం కాశ్మీర్‌కు ప‌య‌నమవుతాడట మహేష్. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. అక్క‌డ కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు.. కీల‌క సన్నివేశాల‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ని సమాచారం. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus