Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గతేడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవే ‘కుబేర’ ‘ఇడ్లీ కొట్టు’ ‘తేరే ఇష్క్ మే’. అల్మోస్ట్ 3 బాగా ఆడాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వరుస సినిమాలతో అలరించాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ‘అమరన్’ వంటి రూ.300 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

Dhanush

 అది అతని కెరీర్లో 55వ సినిమా. ఈ సినిమాలో ధనుష్ కి జోడీగా స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఎంపికయ్యారు. నిన్న అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వాళ్ళ పాత్రల గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు కానీ.. ఈ కాంబో అయితే ఫిక్స్ అయ్యిందని కన్ఫర్మ్  చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో మరింత స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండబోతుంది అని కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

అది నిజమే అని ఈరోజు ప్రూవ్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ హీరో మమ్మూట్టీ కూడా అత్యంత కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించారు. ‘ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి క్రేజీ కాంబినేషన్లో సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.ఈ ప్రాజెక్టు కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

గతంలో మమ్మూట్టీ తమిళంలో నటించిన ‘దళపతి’ ‘ప్రియురాలు పిలిచింది’ వంటి సినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి ధనుష్ 55 కి మార్కెట్  పరంగా కూడా మమ్మూట్టీ పాత్ర హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus