పవన్ తన కొడుకుని మొదట ఎవరి దగ్గరకి తీసుకెళ్లాడో తెలుసా?

  • November 23, 2017 / 07:31 AM IST

మెగా కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న వార్తా వారి అభిమానులకు “స్పెషల్ స్టేటస్” స్థాయి శుభవార్త. అయితే.. మీరు ఇప్పుడు తెలుసుకోబోయే, అదేనండీ చదవబోయే విశేషం మాత్రం నిజంగా మీ మానసుల్ని మునుపెన్నడూ లేని విధంగా ఆనందింపజేస్తుంది. ఏంటా వార్త, అందులో విశేషం ఏంటా అనుకొంటూన్నారా. కంగారెందుకు.. కుదురిగా కూర్చుకొని ఈ ఆర్టికల్ ను చదవండి. ఇటీవల పవన్ కళ్యాణ్ కు రెండో కుమారుడు జన్మించడం, ఆ బుడతడికి “మార్క్ శంకర్ పవనోవిచ్” అనే పేరు పెట్టడం తెలిసిన, మెగా అభిమానులు అందరూ సంబరాలు చేసుకొన్న విషయాలే.

అయితే.. మన మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించడానికి, ఆ చిన్నారికి పేరు పెట్టడానికి మధ్యలో ఓ అద్భుతమైన విషయం జరిగిందని చాలా మందికి తెలియదు. అదేమిటంటే.. తనకు పుట్టిన నాలుగో సంతానమైన మార్క్ శంకర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తాను తల్లిగా భావించే చిరంజీవి సతీమణి, తనకు ఒదిన అయిన సురేఖ వద్దకు తీసుకొచ్చాడట. తన బిడ్డను ఒదిన ఒడిలో పెట్టడమే కాక బిడ్డకు పెట్టబోయే పేరును కూడా ఆమెకే మొదట చెప్పాడట మన పవన్ కళ్యాణ్. ఈ అద్వితీయమైన దృశ్యాన్ని చూసి అక్కడున్నవాళ్లందరి కళ్ళు చెమ్మగిల్లాయట. మామూలుగా ఇలాంటి విషయాలు మీడియాకి చాలా త్వరగా తెలిసిపోతుంటాయి.

కానీ.. కుటుంబ విషయాలు బయటకి రావడం ఇష్టం లేని మెగా హీరోలు ఈ విషయాలని మీడియాతో షేర్ చేసుకోలేదు. అయితే.. మొన్న రామ్ చరణ్ ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించడంతో మెగా అభిమానులు ఆనందంతోకూడిన ఉద్వేగానికి లోనయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus