పసుపతిని సైతం భయపెట్టిన మణికర్ణిక

Ad not loaded.

కంగనా నటిస్తున్న ‘మణికర్ణిక.. ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ ఫిల్మ్‌పై దుమారం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. ఝాన్సీ లక్ష్మీబాయి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఝాన్సీ రోల్‌లో కంగనా రనౌత్‌ నటిస్తోంది. తాజాగా నటుడు సోనూసూద్‌ డ్రాపైనట్లు కంగనా వెల్లడించింది. ఇందులో సదాశివ్‌ అనే మరాఠా రాజు రోల్‌లో ఆయన నటించాల్సివుంది. సోనూ‌పై ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుండగా ఆయన వైదొలగాడు. దీంతో మణికర్ణిక ప్రాజెక్టులో ఏం జరుగుతోందన్న చర్చ బాలీవుడ్‌లో సాగుతోంది.

సోనూ సూద్ గురించి తెలిసినవాళ్లు ఆయన చాలా కమిట్ మెంట్ వున్న వ్యక్తి అని చెబుతారు. ఒకసారి ఒక ప్రాజెక్టు చేయడానికి అంగీకరిస్తే, తన వలన ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటి సోనూ సూద్ హఠాత్తుగా ‘మణికర్ణిక’ సినిమా నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క, ఇప్పటికే కంగనా రనౌత్ తో మనస్పర్థలు వచ్చిన కారణంగా దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశాడనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దర్శకురాలిగా కంగనా తన పేరు వేసుకుంటూ ఉండటం, ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus