వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయనున్న మంజుల

  • September 8, 2018 / 01:53 PM IST

మహేష్ బాబు అక్కగా మాత్రమే కాక నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఘట్టమనేని మంజుల.. ఇటీవల దర్శకురాలిగా తనను తాను నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నంలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆమె దర్శకత్వంలో రూపొందిన “మనసుకి నచ్చింది” చిత్రం డిజాస్టర్ అవ్వడంతోపాటు దర్శకురాలిగా ఆమెకు మాయని మచ్చలా నిలిచింది. ఇప్పుడు ఆ మచ్చని మాయం చేసే పనిలో పడింది మంజుల.

దర్శకురాలిగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయినా.. నిర్మాతగా “షో” సినిమాతో ప్రూవ్ చేసుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోద‌రి మంజుల తాజాగా డిజిట‌ల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న వెబ్ సిరీస్ ల ఆద‌ర‌ణ‌ను గ‌మ‌నించిన మంజుల ఇక‌పై ఆ రంగంలో నిర్మాత‌గా మార‌నున్నారు. “అ!” మూవీతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా మారిన ప్ర‌శాంత్ వ‌ర్మ తో ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు మంజుల‌. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందట. ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus