Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

కొన్ని నెలలుగా చూసుకుంటే.. సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్ (Vishnu Prasad), నిర్మాత తేనెటీగా రామారావు, హిందీ కమెడియన్ రాకేష్ పుజారి (Rakesh Poojari) , మాస్టర్ భరత్ (Master Bharath) తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్ (Mukul Dev),తమిళ నటుడు రాజేష్ (Rajesh),హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుగుమారన్ (Vikram Sugumaran), వైభవ్ కుమార్ సింగ్ (Vaibhav Kumar Singh), షైన్‌ టామ్‌ చాకో తండ్రి సీపీ చాకో, నటి విజయ భాను, దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (A.S. Ravi Kumar Chowdary) వంటి వారు కన్నుమూశారు.

Mannara Chopra

ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి మన్నారా చోప్రా (Mannara Chopra) విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి రామన్ రాయ్ కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు.

కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన… ఇటీవల పరిస్థితి విషమించడంతో ముంబైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు. అంతా బాగానే ఉంది అని వైద్యులు కూడా ఆయన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే నిన్న అంటే ఆదివారం నాడు పరిస్థితి మళ్ళీ విషమించడంతో.. ముంబైలో ఉన్న ఆయన నివాసంలోనే కన్నుమూశారు.

ఈ విషయాన్ని హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈరోజు ముంబైలోని అంబోలి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్టు కూడా తెలిపింది. దీంతో ఆమె ఫాలోవర్స్ ‘స్టే స్ట్రాంగ్’ ‘రిప్’ ‘మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ కామెంట్లు పెడుతూ సంతాపం తెలుపుతున్నారు.

CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus