Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Advertisement

రవితేజ నుండి ఏడాదిన్నర తర్వాత వచ్చిన సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ తో నెలకొన్న బజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ టైంకి చల్లారిపోయింది. నవంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 31 నుండి ప్రీమియర్స్ పడ్డాయి. కానీ చాలా మందికి ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇంకా చెప్పాలంటే రవితేజ అభిమానుల్లో చాలా మందికి సైతం ‘మాస్ జాతర’ వచ్చినట్టు తెలిసుండకపోవచ్చు.

Mass Jathara

అందుకు కారణం ప్రమోషన్స్ లేకపోవడమే. నామ మాత్రంగా చేసిన ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా.. ఈ సినిమాకి ఎటువంటి హైప్ క్రియేట్ చేయలేదు. ఈ విషయంలో పూర్తి మిస్టేక్ నిర్మాత నాగవంశీదే అని చెప్పాలి.’మాస్ జాతర’ మరీ తీసి పారేసే సినిమా కాదు. రవితేజ గత సినిమాలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలన్నిటికంటే ఇది బెటర్ గానే ఉంటుంది.

కరెక్ట్ గా ప్రమోట్ చేసుకుని ఉంటే.. ఓపెనింగ్స్ బాగా వచ్చేవి. అలా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.ఇక 2 రోజుల క్రితం ‘మాస్ జాతర’ ఓటీటీకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇక్కడ కూడా సేమ్ రెస్పాన్స్. ‘మాస్ జాతర’ ఓటీటీకి వచ్చినట్టు చాలా మందికి తెలీదు. కనీసం నిర్మాణ సంస్థ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అఫీషియల్ పేజీలో నామమాత్రంగా అయినా దీని గురించి ట్వీట్ చేయలేదు.నిర్మాత నాగవంశీ కూడా ట్వీట్ చేయకపోవడం గమనార్హం.

‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus