రాంగోపాల్ వర్మే… ఇన్స్పిరేషనా…?

  • January 25, 2019 / 01:00 PM IST

టార్గెట్ చేస్తూ.. ‘బాలయ్య ఎవరో నాకు తెలీదు’ ‘కమెడియన్ బాలకృష్ణ నాకు తెలుసు’ అంటూ కొంతకాలం గడిపిన తరువాత.. అసలు తను ఎందుకు అలా అన్నానో తెలుసుకోండి.. అంటూ… వరుసగా ఆరు వీడియోలను విడుదల చేసి నందమూరి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశాడు. అక్కడితో ఆగాడా అంటే.. ఇప్పుడు రూటు మార్చి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి కొందరి వ్యక్తుల పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నాడు. ‘మై ఛానల్ నా ఇష్టం’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేసి రాజకీయ నాయకుల పై విమర్శలకు తెరతీస్తున్నాడు. మొదట ఈ ఛానల్ ‘సరదాగా నవ్వుకోడానికే తప్ప.. మరి ఎలాంటి దురద్దేశం లేదని.. వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి మాట్లాడకపోయినా, రాజకీయపరమైన విమర్శలు మాత్రం ఈ ఛానల్ ద్వారా వెల్లడిస్తానని’ చెప్పిన నాగబాబు వరుసగా లోకేష్, జగన్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్‌గా వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం గమనార్హం.

అసలు నాగబాబు ఇలా ఎందుకు చేస్తున్నాడనేది అర్ధం కాని ప్రశ్న..! ఈ విషయం పై మెగా ఫ్యాన్స్ బాగానే స్పందిస్తున్నప్పటికీ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పై ఇది మచ్చ తెచ్చే విధంగా ఉందని.. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో పాపులారిటీ కోసం ఇలా చేస్తున్నాడని మరికొందరు… తన అన్నదమ్ములని ఎప్పుడో ఒక మాట అన్నందుకు ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నాడు.. మరి వైసిపి పార్టీ లో ఉన్న రోజా.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైములో చాలా విమర్శలు చేసినా… ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా కామెంట్స్ చేసినా… నాగబాబు రోజా పక్కన కూర్చుని ఎలా నవ్వుతున్నాడు… అసలు రోజాకి సంబంధించి నాగబాబు ఎందుకు నెగటివ్ గా స్పందించట్లేదు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. రాను.. రాను.. మరో ‘ఆర్.జి.వి’ అవుతున్నాడు అంటూ కొంతమంది నాగబాబు పై సెటైర్లు కూడా వేస్తుండడం గమనార్హం. మరి చివరికి ఇది ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus