ఒకే ఫ్రేమ్ లో మెగాహీరోలు.. ఫోటోలు వైరల్!

  • December 25, 2020 / 04:43 PM IST

మొన్నటివరకు సోషల్ మీడియా మొత్తం మెగాహీరోలే కనిపించారు. నీహారిక పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటుకి చేరడంతో ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి మెగా హీరోలు, కజిన్స్ అందరూ కలిశారు. వీరంతా కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, చైతన్య, అల్లు శిరీష్, సాయి తేజ్, మెగా స్టార్ ఇద్దరి కూతుళ్లు ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరకి చేరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. రామ్ చరణ్ ఎప్పటిలానే కోరమీసాలతో కనిపిస్తే.. బన్నీ సింపుల్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ పార్టీని రామ్ చరణ్ భార్య ఉపాసన హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మెగా కజిన్స్ అందరూ సీక్రెట్ సాంటా ఆడారు.

ఇక మెగాహీరోల సినిమాల విషయానికొస్తే.. ఈరోజే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే ‘పుష్ప’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలానే వరుణ్ తేజ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉండగా.. ప్రస్తుతం ‘ఎఫ్3’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus