రాజమౌళి పై మెగా అభిమానులు ఎందుకు కోపంగా ఉన్నారు?

  • January 28, 2017 / 09:24 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమోళి అంటే తెలుగు వారందరికీ అభిమానం. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్నను గౌరవిస్తారు. అయితే ఇప్పుడు మెగా అభిమానులు రాజమౌళి పై కోపంగా ఉన్నారని తెలిసింది. ఎందుకో వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 జనవరి 11 న రిలీజ్ అయింది. నటసింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి జనవరి 12 న విడుదలయింది. ఈ రెండు చిత్రాలను చూసిన రాజమౌళి బాగుందని ట్వీట్ చేశారు. అయితే శాతకర్ణి మూవీకి మాత్రం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ చిత్ర దర్శకుడు క్రిష్ ని జక్కన్న ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్యని తెగ అభినందించేసారు. చిత్రం భలే ఉందని ప్రశంసలు గుప్పించారు. ఇతని మాటలు బాలకృష్ణ మూవీకి మంచి మైలేజ్ ఇచ్చింది. దీనిని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. మెగా ఫ్యామిలీ మీద కోపంతోనే జక్కన్న ఇలా ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమాకు ట్వీట్ లతో సరిపెట్టి,  శాతకర్ణిని ప్రమోట్ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని  మెగా ఫ్యాన్స్ రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus