అంచనాలను అందుకోలేకపోతుంది…!

  • April 27, 2017 / 05:19 AM IST

మెగా స్టార్ చిరంజీవి…టాలీవుడ్ లో 30ఏళ్లు శాసించిన హీరోగా అభివర్ణిస్తారు ఆయన అభిమానులు…వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ అప్పట్లో రాజకీయ రంగా ప్రవేశం చేసి…పాపం అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో…పాలిటిక్స్ కన్నా సినిమాలే బెటర్ అని తెలుసుకుని…మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నాడు…అయితే ‘ఖైదీ నెంబర్ 150’ అంటూ భారీ హంగామాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ భారీ హడావిడితో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరు…ఒక మేరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి….అదే క్రమంలో బుల్లి తెరపై దూసుకుపోవాలి అన్న కసితో…‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ను స్టార్ట్ చేశాడు…అయితే ఆ షో ఆయన పుణ్యమా అంటూ తుస్ మనడం, ఈ షో ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్ నుండి ఈ షోకు మెగా అభిమానులే నెగిటివ్ మార్కులు వేయడం అంతా చూసి….స్టార్ మాటివి యాజమాన్యం ఈషోను రక్షించి ఈ షోకు రేటింగ్స్ పెరిగే విధంగా ఎన్నో మార్గాలను అన్వేషించారు.

దానికి కారణాల విషయంలోకి వెళితే….ఈకార్యక్రమంలో చిరంజీవి అడుగుతున్న క్వశ్చన్స్‌ కొన్ని మరీ సిల్లీగాను లేదంటే ఎవరికీ సమాధానం తెలియనంతగా ఉండటంతో సగటు బుల్లితెర ప్రేక్షులకు ఈషో పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎలా అయినా ఈ షో ని రక్షించాలి అని…అనేక మార్గాలు ఆలోచించి సెలెబ్రెటీ రౌండ్స్ ను ప్రసారం చేస్తున్నారు. అయినా ఏం లాభం లేకుండా పోయింది..సాక్షాత్తూ మెగాస్టార్…ఒక పక్క…సెలెబ్రెటీస్ ఒక పక్క అయిన…షో ఎవ్వరూ చూడడం లేదు…ఇదే సీన్ ఇంకొన్నాళ్ళు రిపీట్ అయితే అంతా అస్సామే అన్న టాక్ వినిపిస్తుంది…చూద్దాం ఏం జరుగుతుందో…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus