అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సినిమాలో మెహ్రీన్.!

  • March 30, 2018 / 10:25 AM IST

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం  విక్టరీ వెంకటేష్ తేజ దర్శకత్వంలో  “ఆట నాదే వేట నాదే” అనే సినిమా చేస్తున్నారు. వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత వీరిద్దరూ అనిల్ రావిపూడి  దర్శకత్వంలో నటించనున్నారు. అందుకోసం అనిల్ రావిపూడి వైజాక్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చారు.

ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) పేరు ఫిక్స్ చేసిన ఈ చిత్రానికి ఆర్టిస్టుల సెలక్షన్ మొదలెట్టారు. ఇందులో ఒక హీరోయిన్ గా తమన్నాని సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈమె వెంకీకి జోడీగా కనిపించనున్నట్లు తెలిసింది. తాజాగా వరుణ్ తేజ్ కి జోడీగా మెహ్రీన్ ఫిక్స్ చేసినట్లు టాక్. రాజా ది గ్రేట్ లో ఆమె నటనకు మెచ్చిన అనిల్ ఇందులోనూ అవకాశం ఇచ్చారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus