వాయిదా పడిన ‘ధోని’

  • June 21, 2016 / 01:25 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎం‌ఎస్ ధోని:ది అన్ టోల్డ్ స్టోరీ’. బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అరుణ్ పాండే సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 2న విడుదల చేయాలనుకున్నారు.

అయితే గ్రాఫిక్స్ వర్స్క్ కారణంగా ఈ చిత్ర విడుదలను మూడు వారాల పాటు వాయిదా వేశారు. వాయిదా వేసిన చిత్రాన్ని సెప్టెంబర్ 30 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా, దిశా పాట్నీ,కీయరా అద్వానీ, హెర్రి తగ్రీ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus