MS Raju: అప్పటి గొడవలపై ఎమ్మెస్ రాజు కామెంట్స్!

  • May 25, 2021 / 02:04 PM IST

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అయ్యేవారు ఎమ్మెస్ రాజు. ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే సినిమా నిర్మించింది కూడా ఆయనే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ లో ప్రభాస్ హీరోగా ‘పౌర్ణమి’ అనే సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఈ సినిమా సమయంలో దర్శకుడు ప్రభుదేవాకు, ఎమ్మెస్ రాజుకి గొడవలు వచ్చాయని.. మధ్యలో ప్రభాస్ ఇన్వాల్వ్ అయ్యి గొడవలు సద్దుమణిగేలా చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఎమ్మెస్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు ప్రభుదేవాతో గొడవ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెస్ రాజు. నిజానికి ప్రభుదేవా మంచి పొజిషన్ లో ఉన్నాడని ఎంతో సంతోషిస్తానని..

అలాంటిది అతడితో తనకు గొడవలు ఎందుకు వస్తాయని తిరిగి ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. నిర్మాతగా సినిమాలు తీసిన రాజు.. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘డర్టీ హరి’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ అనే పేరుతో మరో సినిమాను అనౌన్స్ చేశారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus