Prabhas: ఆ వార్తలపై ప్రభాస్ స్పందిస్తే బెటర్!

  • September 14, 2021 / 10:59 AM IST

స్టార్ హీరో ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా ఆదిపురుష్ ఈ ఏడాది చివరినాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించనున్నారని వృందావన అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రతి హీరో తన సినీ కెరీర్ లో 25వ సినిమా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తన 25వ మూవీ కోసం ఎలాంటి కథను ఎంచుకున్నారో తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉండటం గమనార్హం. ఈ మూవీ అధికారక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేస్తున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్ లో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వచ్చాయి. ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. గతంలో బృందావనం సినిమాను నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం వృందావన టైటిల్ ను ప్రభాస్ మూవీ కోసం పరిశీలిస్తుండటం గమనార్హం. ప్రభాస్ 25వ సినిమా గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus