ఆ దర్శకుడితో గోపీచంద్ ఒన్స్ మోర్!

  • June 8, 2016 / 02:28 PM IST

“సౌఖ్యం” లాంటి సూపర్ డిజాస్టర్ అనంతరం కథానాయకుడు గోపీచంద్ తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఒల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్”లో నటిస్తున్న గోపీచంద్, ఈ సినిమా అనంతరం తనకు “ఆంధ్రుడు” లాంటి పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన పరుచూరి మురళి దర్శకత్వంలో నటించేందుకు సమ్మతించాడని తెలుస్తోంది.

పరుచూరి మురళి మునుపటి చిత్రాలు “పిక్కెక్కిస్తా, అధినాయకుడు” డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో ఓ మంచి కథ రాసుకొని, గోపీచంద్ కు చెప్పాడని, గోపీ వెంటనే పచ్చజెండా ఊపాడని సమాచారం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus