ఈ ఫ్రెండ్స్‌ జోరు మామూలుగా లేదుగా

  • February 11, 2021 / 12:33 PM IST

సరైన సినిమా తీసే దర్శకుడు కనిపించినా, హిట్‌ ఇచ్చే హీరో కనిపించినా మైత్రీ మూవీ మేకర్స్‌ అస్సలు ఆగదు. వెంటనే కలిసి ప్రాజెక్టు ఓకే చేసుకొని అడ్వాన్స్‌ ఇచ్చేస్తుంటారు. అలా మ్రైత్రి మూవీ మేకర్స్‌ మంచి జోరు మీద ఉందని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో సినిమా చేస్తూనే, ప్రామిసింగ్‌ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. వాటిలో ఎక్కువ శాతం విజయాలే. అయితే ఇప్పుడు మైత్రి వాళ్ల చూపు ఇతర ‘వుడ్‌’ల మీద పడింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు అడ్వాన్స్‌ ఇచ్చారని వార్తలు వస్తుండగా… తమిళ పరిశ్రమలో ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని తెలుస్తోంది. ఈలోగా తమిళంలో విజయ్‌తో ఓ సినిమా ఓకే అయ్యిందట. మైత్రీ మూవీ మేకర్స్‌కి. విజయ్‌తో భారీ సినిమా తీసేందుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారట. విజయ్‌తో సినిమా అంటే వందల కోట్ల వ్యవహారం. ప్రస్తుతం విజయ్‌ తీసే సాధారణ సినిమా అయినా కోట్లు సంపాదిస్తోంది.

దీంతో మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌ ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం విజయ్‌కి ఇప్పటికే ₹11 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారని టాక్‌. అయితే దర్శకుడు ఎవరు, సినిమా ప్రారంభం ఎప్పుడు లాంటి ఆలోచనలేవీ లేవట. సరైన కథ, సమయం దొరికినప్పుడు మొదలుపెట్టేస్తారు. ఇదే మైత్రీ మూవీ మేకర్స్ స్ట్రాటజీ అండ్ స్టయిల్‌ కూడా. ఇటీవల మైత్రీ టీమ్‌ చిరంజీవి సినిమా ఓకే చేయించుకుంది. ఇంకా ఎంతమంది వరుసలో ఉన్నారో.. ‘మైత్రి’తో మైత్రి కలుపుకోవడానికి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus