మహేష్ వల్ల కన్ఫ్యూజన్లో పడ్డ నాగ చైతన్య..!

  • March 11, 2020 / 01:51 PM IST

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు మహేష్ బాబు. ఆ సినిమా ప్రమోషన్ల టైంలోనే తన తరువాతి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు కూడా తెలిపాడు. ఇదే విషయాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్లో దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. కానీ అనుకోని విధంగా.. వంశీ వినిపించిన స్క్రిప్ట్ నచ్చలేదని మహేష్ రిజెక్ట్ చేసాడని వార్తలు వచ్చాయి. దీంతో ‘గీత గోవిందం’ పరశురామ్(బుజ్జి) లైన్ లోకి వచ్చాడు.

విషయాన్ని మరింతగా పరిశీలిస్తే.. దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర రైటర్ గా పనిచేసే అశిషోర్ సోలమన్….. నాగార్జున ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. ‘వైల్డ్ డాగ్’ పేరుతో ఆ చిత్రం తెరకెక్కుతోంది. ‘మహర్షి’ చిత్రం విజయంలో కూడా అతని పనితనం ఉందనేది ఇన్సైడ్ టాక్. అందుకే వంశీ స్క్రిప్ట్ సరిగ్గా రెడీ చెయ్యలేదని డిస్కషన్లు నడుస్తున్నాయి. నాగార్జున వల్ల మహేష్- వంశీ సినిమాకు అలా దెబ్బ పడింది. అయితే మరో వైపు ఈ ప్రభావం నాగ చైతన్య సినిమా కూడా పడింది. అదేంటంటే.. ‘లవ్ స్టోరీ’ చిత్రం తరువాత నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ టైములో మహేష్ కు ఓ స్క్రిప్ట్ ను వినిపించాడు పరశురామ్. కానీ వంశీ పైడిపల్లి తో సినిమాకి కమిట్ అయ్యాడు కాబట్టి.. అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యింది కాబట్టి పరశురామ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీని వల్ల ’14 రీల్స్’ వారి నిర్మాణంలో నాగ చైతన్య- పరశురామ్ ల ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మహేష్ కనుక నో చెబితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అందుకే మహేష్ డెసిషన్ గురించి నాగ చైతన్య వెయిట్ చెయ్యాల్సి వస్తుందట. మరి ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus