నాగబాబు నీహారికను చూడనన్నాడట!

  • June 9, 2016 / 07:30 AM IST

తమ వారసుల సినీ ఆరంగేట్రాన్ని అందరికంటే ముందుగా చూడాలనుకొంటారు తల్లిదండ్రులు. కానీ.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అందుకు విరుద్ధంగా తన ముద్దుల తనయ నీహారిక పరిచయ చిత్రం “ఒక మనసు” సినిమాను మాత్రమే కాదు రాషెస్ కూడా చూడనన్నాడట. అయితే.. అందుకు కారణం ఉంది. అదేమిటంటే, తన కుమార్తె పెర్ఫార్మెన్స్ ను డైరెక్ట్ గా ప్రేక్షకులతో కలిసి మొదటిరోజు చూడాలనుకొంటున్నాడట.

“మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు” ఫేమ్ రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 24న విడుదలకానుంది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంపై మెగా అభిమానులే కాక.. క్లాస్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus