అల్లు అర్జున్ చిత్రంతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్న నాగబాబు

  • February 20, 2017 / 08:20 AM IST

రుద్రవీణ, త్రినేత్రుడు, బావగారు బాగున్నారా, స్టాలిన్ వంటి మంచి సినిమాలను నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు ఆరెంజ్ సినిమాతో అప్పుల పాలయ్యారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఘోర అపజయం చవిచూసింది. నాగబాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఆయన నిర్మాణానికి దూరమయ్యారు. సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. మళ్ళీ ఆయన నిర్మాతగా మారనున్నారు. తన అల్లుడు అయిన అల్లు అర్జున్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చేస్తున్నారు.

దీని తర్వాత రచయిత వక్కంతు వంశీని డైరక్టర్ గా పరిచయం చేస్తూ “నా పేరు  సూర్య  నా ఇల్లు ఇండియా” అనే టైటిల్ తో మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, బన్నీవాసు సంయుక్తం గా నిర్మించనున్నారు. అయితే వీరిద్దరితో పాటు నాగబాబు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఒక్కడిగా సినిమా నిర్మించే సాహసం చేయలేక నాగబాబు ఇద్దరితో కలిసి అల్లు అర్జున్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా గురించి అధికారంగా త్వరలో వెల్లడించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus