నాగ్, అమల.. మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు వైరల్..!

  • February 10, 2021 / 12:11 PM IST

టాలీవుడ్ సెలబ్రిటీలు వరుస పెట్టి మాల్దీవుల్లో మెరుస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. గతేడాది అక్టోబర్లో పెళ్లి చేసుకున్న కాజల్ హనీమూన్ ట్రిప్ నిమిత్తం తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ ఫోటో షూట్లలో పాల్గొని.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి.. ఆ అందమైన ప్రదేశాలను విజిట్ చెయ్యకపోతే వేస్ట్ అన్నట్టు కామెంట్లు పెట్టింది. అంతే.. ఈ స్టార్ హీరోయిన్ ఇలా కామెంట్ పెట్టడంతో వరుస పెట్టి మన టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు.

కాజల్ తరువాత రకుల్ ప్రీత్ సింగ్, దిశా పటాని,ప్రణీత, శాన్వి శ్రీవత్స.. వంటి హీరోయిన్లతో పాటు నాగ చైతన్య, సమంత… నిహారిక,చైతన్య.. మంచు ఫ్యామిలీ.. అలాగే ఈ మధ్యనే కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా అక్కడ సందడి చేసిన ఫోటోలను మనం చూసాము. తాజాగా ఈ లిస్ట్ లోకి మన ‘కింగ్’ నాగార్జున, అమల కూడా చేరారు. అవును ఈ మధ్యనే నాగార్జున, అమల దంపతులు కూడా మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లారు. అక్కడ వారు ఎంజాయ్ చేసిన ఫోటోలను అమల తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఈ ఫొటోల్లో అఖిల్, చైతన్య,సమంత లు లేరు. వారు ముందుగానే మాల్దీవుల ట్రిప్ కు వెళ్ళొచ్చేసారు. ఇక నాగ్,అమల మాల్దీవుల ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యనే తన ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాగార్జున.. తరువాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘బంగార్రాజు’ చిత్రం చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

1

2

3

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus