Nagarjuna: ఆ సినిమా ఫలితం నాగార్జునను బాధ పెట్టిందా?

  • November 21, 2021 / 11:45 AM IST

స్టార్ హీరో నాగార్జున తన సినీ కెరీర్ లో ఎంతోమంది ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలను ఇచ్చారు. మహేష్ భట్ డైరెక్షన్ లో నాగార్జున నటించిన క్రిమినల్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బాలీవుడ్ డైరెక్టర్ అయిన మహేష్ భట్ తెలుగులో నటించిన ఒక సినిమా ఇదే కావడం గమనార్హం. రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. డాక్టర్ అజయ్ పాత్రలో అద్భుతంగా నటించి నాగార్జున ఈ సినిమాతో మెప్పించారు.

ఈ సినిమా కథ మనస్సుకు నచ్చడంతో నాగార్జున ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమా కొరకు నాగ్ గడ్డం పెంచడంతో పాటు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పలేదు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో నాగార్జున చాలా బాధ పడ్డారని తెలుస్తోంది. నాగార్జున మనస్సుకు ఈ సినిమా నచ్చినా ప్రేక్షకుల మనస్సుకు మాత్రం నచ్చకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమా పాటలు మాత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.

ఆ తరం ప్రేక్షకులతో పాటు ఈతరం ప్రేక్షకులను కూడా క్రిమినల్ పాటలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతోంది. నాగార్జున ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus