నాకు రాజకీయాల పై అస్సలు ఆసక్తిలేదంటున్న నాగ్ ..!

ఇటీవల అక్కినేని నాగార్జున…. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న ఓ ఫోటో బయటకి వచ్చింది. దీంతో నాగార్జున త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని… ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండీ వైసీపీ అభ్యర్థిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని.. వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయం పై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

ఈ విషయం పై నాగార్జున స్పందిస్తూ… “వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నాకు రాజకీయాల పై అస్సలు ఆసక్తి లేదు. వైఎస్ జగన్ నాకు మంచి స్నేహితుడు. వైఎస్ఆర్ కుటుంబానికి… మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. జగన్ ను సాధారణంగానే కలిశానే తప్ప… రాజకీయాల సంబందించిన విషయాల గురించి అస్సలు కాదు. నేను ఇతరుల టికెట్ కోసం జగన్ తో చర్చించేందుకు వచ్చానని కూడా వార్తలొచ్చాయి… అందులో ఎంత మాత్రం నిజం లేదు. వైఎస్ జగన్ ఏపీలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా పూర్తిచేసినందుకు గానూ నేను శుభాకాంక్షలు తెలుపడానికి మాత్రమే కలిశాను”… అంటూ నాగార్జున తెలియజేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus