Nagarjuna: నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయా?

  • September 30, 2024 / 05:52 PM IST

ఈ మధ్య కాలంలో విడుదలైన ఫీల్ గుడ్ సినిమాలలో సత్యం సుందరం (Sathyam Sundaram) ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమా నిడివి ఎక్కువగానే ఉన్నా క్లాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండటం గమనార్హం. ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే విషయంలో తనకెవరూ సాటిరారని దర్శకుడు ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశారు. అయితే ఈ సినిమాకు నాగార్జున (Nagarjuna) రివ్యూ ఇవ్వడం గమనార్హం. ఊపిరి రోజులు గుర్తుకొచ్చాయంటూ ఈ సినిమా చూసి నాగార్జున కామెంట్లు చేశారు.

Nagarjuna

డియర్ బ్రదర్ కార్తి (Karthi) అంటూ అభిమానంతో కామెంట్లు చేస్తూ పోస్ట్ మొదలుపెట్టిన నాగ్ నిన్న రాత్రి సత్యం సుందరం మూవీ చూశానని సినిమాలో కార్తీ, అరవిందస్వామి (Arvind Swamy)  అద్భుతంగా యాక్ట్ చేశారని పేర్కొన్నారు. సినిమా చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నానని నాగ్ పేర్కొన్నారు. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయానని నాగ్ తెలిపారు. ఈ సినిమాను చూస్తున్న సమయంలో బాల్యంకు సంబంధించిన జ్ఞాపకాలు, ఊపిరి సినిమా రోజులు గుర్తుకొచ్చాయని నాగ్ పేర్కొన్నారు.

మనసును హత్తుకునే సినిమాలను విమర్శకులు మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉందని నాగ్ కామెంట్లు చేశారు. సత్యం సుందరం టీమ్ అందరికీ నా అభినందనలు అని నాగ్ అన్నారు. నాగ్ కామెంట్ల గురించి కార్తీ స్పందిస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్యా అంటూ రియాక్ట్ అయ్యారు. నాగార్జున మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని మా సినిమాకు మీకు నచ్చినందుకు హ్యాపీగా ఉన్నామని పేర్కొన్నారు.

మంచి సినిమాపై మీరు చూపించే ఆదరణ మాలో ఎంతో స్పూర్తి నింపుతుందని కార్తీ తెలిపారు. దేవర సినిమాకు పోటీగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అవుతోంది. నాగార్జున, కార్తీ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.

ఈసారి దసరాకు ‘సూపర్‌ 6’.. ఏవి మెరుస్తాయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus