మొదలు కానున్న నాని, కిషోర్ తిరుమల సినిమా

  • January 4, 2018 / 01:20 PM IST

ప్రతి బాల్ కి సిక్స్ కొట్టే బ్యాట్సమెన్ లా నేచురల్ స్టార్ నాని వరుసగా హిట్స్ కొడుతున్నారు. డబల్ హ్యాట్రిక్ హిట్ తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని చేసిన MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ కూడా భారీ కలక్షన్స్ సాధించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో మూవీని నాని మొదలెట్టారు. అదే “కృష్ణార్జున యుద్ధం”. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీని తర్వాత హను రాఘవపూడి, కిశోర్ తిరుమలతో సినిమాలు చేయనున్నారు. అయితే వీటిలో కిశోర్ తిరుమలతో చేసే సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి చిత్రలహరి అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. ఈ కథ పాతికేళ్ళ క్రితం మొదలవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా మార్చి రెండోవారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత కిషోర్ తిరుమల చేస్తోన్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. దీంతో పాటు నాని.. అక్కినేని నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాని కూడా ప్రారంభించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus