ఆ ప్రమాదం వల్ల.. మనసు మార్చుకున్న ప్రభాస్

  • February 3, 2021 / 08:00 PM IST

రెబల్ స్టార్ హీరో ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ ఇంకా విడుదల కూడా కాలేదు. అప్పుడే రెండు సినిమాల షూటింగ్స్ ను స్టార్ట్ చేస్తున్నాడు. సలార్ షూటింగ్ ప్రస్తుతం గోదావరిఖని బొగ్గు గనుల్లో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ కోసం ప్రభాస్ 15రోజుల కాల్షీట్స్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సాలార్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక మంగళవారం ముంబైలో ఆది పురుష్ మొదటి షెడ్యూల్ కూడా మొదలైంది.

అయితే మొదటి రోజే ఫైర్ యాక్సిడెంట్ కావడం వలన షెడ్యూల్ తారుమరయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 15 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ పడడంతో మరో కొత్త కాల్షీట్స్ రెడీ చెయ్యాలి. ఓ వైవు సలార్ షూటింగ్ కు ఇబ్బంది కలగకుండా డేట్స్ సెట్ చేసుకోవాలి అంటే కష్టమే. నెలరోజుల్లో సగం సగం డేట్స్ ను డివైడ్ చేసుకొని రెండు సినిమాలతో బిజీగా మరాల్సి ఉంటుంది. రెండు సినిమాల షూటింగ్స్ వలన కొన్నిసార్లు అస్సలు రెస్ట్ దొరికే అవకాశం లేదని తెలుస్తోంది.

రెబల్ స్టార్ ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. మొదట సలార్ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసి ఆ తరువాత ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus