కొత్త టెక్నాలజీతో ఆర్టిస్టుల సెలక్షన్ చేస్తున్న తేజ

  • January 3, 2018 / 02:46 PM IST

మహానటుడు నందమూరి తారకరామారావు… నటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా విశేష సేవలు అందించారు. అటువంటి వ్యక్తి గురించి తెలియని ఎన్నోఅంశాలు మేళవించి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీని తేజ తెరకెక్కించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ గా నటసింహ నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. అటువంటి పోలికలు ఉన్న ఆర్టిస్టును ఎంచుకోవడానికి తేజ కొత్త టెక్నాలజీ వినియోగించుకుంటున్నారు. ఫేషియల్ రెకగ్నిషన్ అనే కొత్త తరహా టెక్నాలజీతో బసవతారకం పోలికలకు దగ్గర ఉండే నటిని సులభంగా ఎంచుకోనున్నారు.

ఈ పాత్ర కోసం ఇదివరకే చాలా మంది ప్రొఫైల్స్ పంపించారు. వాటిని ఇప్పుడు ఈ సాఫ్ట్ వేర్ తో పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ పై తీసిన కొన్ని షాట్స్ కలయికతో ఈ చిత్ర టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి ( జనవరి 18 )నాడు రిలీజ్ చేయనున్నారు. ఇక బాలకృష్ణ కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జై సింహ సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12 రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తేజ ఎన్టీఆర్ బయోపిక్ పనులను చూస్తూనే వెంకటేష్ తో మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus