నవంబర్ 8న నిఖిల్ ‘ముద్ర’

  • August 10, 2018 / 12:30 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ముద్ర”. టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. అలాగే.. కరెంట్ ఇష్యుస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు.

నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి నవంబర్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిఖిల్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది, అతడు జర్నలిస్ట్ గా నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus