2021 లో 3 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్న నితిన్.. కానీ..?

  • February 19, 2021 / 02:19 PM IST

యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అతను చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్లో చేసిన ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతుండగా..వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేసిన ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతుంది. ఇక మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చెయ్యబోతున్న చిత్రాన్ని కూడా జూన్ 11న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు.ఇది నితిన్ కు 30వ సినిమా కావడం విశేషం.

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రానికి ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చెయ్యలేదు.నభా నటేష్ హీరోయిన్‌ గా నటిస్తుండగా తమన్నా నెగిటివ్ రోల్ లో కనిపించబోతుంది.అక్కడ టబు చేసిన పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు సమాచారం. ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.ఇక 4 నెలల్లోనే నితిన్ నుండీ 3 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న మాట. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాల డైరెక్టర్లు అందరూ ప్లాపుల్లో ఉన్నవారే..!

ముందుగా ‘చెక్’ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి విషయానికి వస్తే.. అతని గత చిత్రం ‘మనమంతా’ ప్లాప్ గా మిగిలింది. ‘రంగ్ దే’ దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా నిరాశపరిచింది. ఇక మేర్లపాక గాంధీ గత చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఘోర పరాజయాన్ని చవి చూసింది. గతేడాదే ‘భీష్మ’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన నితిన్.. ఈ ప్లాప్ దర్శకులతో చేసిన సినిమాలను ఒకే టైములో విడుదల చేస్తూ రిస్క్ చేస్తున్నాడా.. అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. మరి వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus