నితిన్,రకుల్.. ఇద్దరి ఆశలు ఆ చిత్రం పైనే…?

  • December 27, 2018 / 12:38 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ‘అఆ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నితిన్.. ఆ తరువాత ‘లై’ ‘చల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి హ్యాట్రిక్ డిజాస్టర్లతో డీలా పడిపోయాడు. ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో వున్నాడు నితిన్. నాగశౌర్య తో ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుములతో డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు నితిన్. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నితిన్ భుజానికి గాయం కావడంతో చిత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నితిన్ కోలుకోనుండడంతో ఈ చిత్రాన్ని వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

ఇక ఈ చిత్రంతో పాటు మరో క్రేజీ చిత్రాన్ని నితిన్ లైన్లో పెట్టినట్టు సమాచారం. డిఫరెంట్ చిత్రాలతో అందరినీ ఆకట్టుకునే చంద్రశేఖర్ యేలేటి ఇటీవల నితిన్ ను కలిసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం .ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ను ఎంచుకున్నారట. వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది రకుల్. అయితే కొత్త హీరోయిన్లు పోటీ కారణంగా ఆమె జోరు తగ్గింది. అందుకే ఆమె కోలీవుడ్, బాలీవుడ్ వైపు మళ్ళిందట. ఇక ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వుద్దేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus