కొత్త అవతారం ఎత్తనున్న నిత్య..!

  • June 19, 2020 / 09:12 PM IST

‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిత్యా మేనన్. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు ఓ పాట కూడా పాడి తను మల్టీ ట్యాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. దాంతో ఆమెకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈమె నటించిన ‘ఇష్క్’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అయితే ఆ తరువాత ఈమె బొద్దుగా తయారవ్వడంతో తరువాత ఈమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. దీంతో ఫిట్ నెస్ పై కూడా ఈమె ఫోకస్ పెట్టి సన్నబడింది. గతేడాది ఈమె బాలీవుడ్ లో నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ మంచి నటిగాను, సింగర్ గాను మాత్రమే పరిచయమైన నిత్యమేనన్.. త్వరలోనే తనలోని మరో ట్యాలెంట్ ను కూడా బయటపెట్టడానికి కూడా రెడీ అవుతుందట. వివరాల్లోకి వెళితే.. నిత్యా మేనన్ సొంతంగా ఓ కథను తయారు చేసుకుందట.

ఈ కథని ఓ నిర్మాతకు కూడా వినిపించిందట. నిత్యా వినిపించిన కథ నచ్చడంతో.. ఆ నిర్మాత ఈమెకు డైరెక్టర్ ఛాన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. నిత్యా డైరెక్ట్ చేసే సినిమా కనుక హిట్ అయితే ఈమె కూడా భానుమతి, సావిత్రి, విజయనిర్మల, జీవిత వంటి వారి లిస్ట్ లో చేరినట్టే.! ఎందుకంటే వారు కూడా హీరోయిన్లుగా సినిమాల్లో నటించి..మరోపక్క డైరెక్షన్ కూడా చేసి సక్సెస్ అయ్యారు.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus