పవన్ తో పాటు బన్నీ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఏక కాలంలో విడుదల చేయనున్నారు. దీంతో ఈ చిత్రంలో పర భాషా నటుల్ని కూడా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ హీరో ధనుంజయ్ ను ఎంచుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. రాంగోపాల్ వర్మ ‘భైరవగీత’ చిత్రం ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

ఇక సునీల్ శెట్టి లేదా సంజయ్ దత్ లలో ఒకరిని విలన్ గా ఎంచుకునే అవకాశం కూడా ఉందట. ఇక తమిళ్ నుండీ విజయ్ సేతుపతి ని తీసుకోవాలి అనుకున్నారు కానీ.. ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా… ఇప్పుడు ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ను కూడా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈమెకు తమిళ, మలయాళం లో కూడా మంచి క్రేజ్ ఉంది.. అందులోనూ మంచి నటి కూడా…!

అందుకే సుకుమార్ ఈమెను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. మరోపక్క పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ లో కూడా నివేధా థామస్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus