ఎన్టీఆర్…మహేష్ ఇద్దరూ గ్యాప్ తో వస్తున్నారు!

  • June 30, 2017 / 10:59 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలే…అయితే ఒక రకంగా చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు వార్ కూడా చేశారు. అయితే అదే క్రమంలో కొన్ని సార్లు ప్రిన్స్ గెలిస్తే…మరికొన్ని సార్లు ఎన్టీఆర్ ప్రిన్స్ పై గెలిచాడు. ఇదిలా ఉంటే, అసలు మ్యాటర్ లోకి వెళితే…ఈ ఇద్దరు ఒక అండర్‌స్ట్యాండింగ్ కి వచ్చారని సమాచారం. అంతేకాదు…ఈ ఇద్దరు కలసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట. అంతేకాకుండా ప్రిన్స్ సూచన మేరకే ఎన్టీఆర్ అలా చేసేందుకు ఒకే చెప్పాడని తెలుస్తుంది…అసలు మ్యాటర్ ఏంటి అంటే…ప్రిన్స్ మహేష్, ఎన్.టి.ఆర్ ఇద్దరూ కలసి ప్రస్తుతం వారు చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ ల విషయంపై ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇక వివరాల్లోకి కాస్త లోతుగా వెళితే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే అఫిషియల్ గా చెప్పకపోయినా మహేష్ స్పైడర్ కూడా దసరా రేసులో ఉంటాడని అన్నారు.

మహేష్ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాకముందే తన నిర్ణయం మేరకే ఎన్.టి.ఆర్ జై లవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారని అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు రెండు ఒకే రోజు వస్తే బాక్సాఫీస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే మహేష్ సలహా తీసుకుని ఎన్.టి.ఆర్ ప్రొసీడ్ అవుతున్నాడని అంటున్నారు. జై లవకుశలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక మహేష్ స్పైడర్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతుంది. రెండు సినిమాలు వేరు వేరు జానర్లతో రాబోతున్నా రిలీజ్ కు కొంత టైం ఉంటేనే వర్క్ అవుట్ అవుతాయి. మొత్తంగా చూసుకుంటే వారి స్వప్రయోజనాలే కాకుండా…అటు నిర్మాతలు, ఇటు బయ్యర్స్ సైతం సేఫ్ జోన్ లో ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus