ట్విస్ట్ లతో పిచ్చెక్కించనున్న ఎన్టీఆర్

  • December 10, 2016 / 10:27 AM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న మూవీ వివరాలను నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే కథలో కీలక పాయింట్ బయటికి వచ్చింది. దర్శకుడు బాబీ చెప్పిన కథలో ఆ పాయింట్ నచ్చే అతనికి తారక్ అవకాశం ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితంకానున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్లో కనిపించనున్నారు. ఒకరే ముగ్గురిగా నటిస్తారా, త్రి పాత్రాభినయం చేస్తారా? అనే దానిలో క్లారిటీ లేదు కానీ.. నటనలో మూడు వేరియేషన్లు ఉండడం మాత్రం పక్కా అని తెలిసింది.

కథలో ఈ ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయని సమాచారం. ఇది తెలిసి అభిమానులు ఆనందంలో ఉంటే  ఎన్టీఆర్ చాలా కోపంగా ఉన్నారు. సినిమాలో అత్యంత కీలకమైన పాయింట్ ని ఎవరికీ చెప్పకుండా దాచాల్సింది పోయి .. ఇలా లీక్ చేస్తారా ? అని ఈరోజు దర్శకుడు బాబీ ని అడిగారు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండమని సూచించారు. 60 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ సంక్రాంతి అనంతరం సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్ గా సమంతను, మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ని తీసుకోవాలని డైరక్టర్ ప్రయత్నిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus