ఎన్టీఆర్ అభిమానులు తరుణ్ భాస్కర్ పై ఎందుకు మండిపడుతున్నారో తెలుసా ?

  • May 6, 2017 / 07:57 AM IST

అచ్చమైన తెలుగు సినిమాని తెరకెక్కించి తరుణ భాస్కర్ అందరితో అభినందనలు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం పెళ్ళిచూపులు ఆర్ధికంగా మంచి విజయం సాధించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకుంది. ఉత్తమ చిత్రంగానే కాకుండా ఉత్తమ మాటలకు అవార్డు వరించాయి. దీంతో తరుణ్ ఒక్క సినిమాతోనే దేశంమొత్తం గుర్తింపు పొందారు. అయితే ఆయన సినిమాలో రాసిన మాటలకు అవార్డు అందుకుంటే.. బయట చెప్పిన మాటలకు శత్రువులను సంపాదించుకున్నారు. రీసెంట్ గా తరుణ్  భాస్కర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ  “ఐఫా అవార్డ్స్” వారు టీఆర్పీ రేటింగ్ కోసమే జనతా గ్యారేజ్ కి అవార్డు ఇచ్చారు. నాకు అవార్డు ఇవ్వడం కన్నా ఎన్టీఆర్ కి అవార్డు ఇవ్వడం వల్ల వారికీ ఆదాయం వస్తుంది” అని చెప్పారు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు.

తరుణ్ భాస్కర్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. కొందరైతే అతను చనిపోయినట్లు కూడా పోస్టులు చేశారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గుర్తించిన తరుణ్  సోషల్ మీడియాలో స్పందించారు.  “ఎన్టీఆర్ సార్ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియక అలా అనేశాను. ఇక నుంచి ఆ పొరపాటు చేయను. ఇంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాదు మీడియా ముఖంగా క్షమాపణలు చెబుతాను” అని నిన్న తన పేస్ బుక్ అకౌంట్ లో ఎన్టీఆర్ అభిమానులు వేడుకున్నారు. అతని పోస్ట్ తో సోషల్ మీడియాలో ఉన్నవారు శాంతించినా.. బయట ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తరుణ్ మీద కోపంగానే ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus