భారీ ర్యాలీ తో తారక్ కి స్వాగతం చెప్పిన రాజమండ్రి ఫ్యాన్స్

  • December 23, 2016 / 02:37 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కు రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. తారక్ తన భార్య లక్ష్మీప్రణతితో కలిసి కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడుగునా భారీ ర్యాలీ నిర్వహించారు. అనుకోకుండా జరిగిన ఈ టూర్ సంచలనమైంది.

ఈ టూర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పాల్గొనడంతో ఇది కుటుంబ టూర్ మాత్రమే కాదు, దీని వెనుక రాజకీయ కోణం కూడా దాగుందని కొన్ని పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. తన తండ్రి హరికృష్ణ కి రాజకీయ ప్రాధాన్యం తగ్గినప్పటినుంచి రగిలిపోతున్న ఎన్టీఆర్ ఒక్కసారి తన బలాన్ని చూపించడానికి ఈ ర్యాలీ చేశారని అనుకుంటున్నారు. ఈ దెబ్బతో సీఎం చంద్రబాబు నాయుడు దిగి వచ్చి తనని పార్టీలోకి ఆహ్వానం పలుకుతారని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus